Arjun Bali : స్నేహితుడి తల్లికి రెమ్ డెసివిర్ ఇచ్చేందుకు బైక్ పై 420కి.మీ ప్రయాణం
కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే.
Chandigarh-Alwar కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు అందించే ఔషధాల్లో రెమ్ డెసివిర్ ప్రధానమైనది. అయితే కరోనా బారిన పడిన తన స్నేహితుడి తల్లికి రెమ్ డెసివర్ ఇంజెక్షన్ ను అందించేందుకు ఓ యువకుడు బైక్ పై ఏకంగా 420కి.మీ ప్రయాణించాడు.
పంజాబ్ రాష్ట్రంలోని చండీగడ్కు చెందిన అర్జున్ బాలీ, రాజస్తాన్ లోని అల్వార్ కు చెందిన సాహిల్ సింగ్ రాథోడ్ స్నేహితులు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో వీరిద్దరూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో వీరిద్దరూ తమ తమ స్వస్థలాల్లో ఉంటున్నారు.
. అయితే సాహిల్ తల్లి ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆమె ఆక్సిజన్ స్థాయి 84కు పడిపోయి ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో సాహిల్ దాని కోసం అల్వార్ అంతా తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మిత్రుడు అర్జున్కు విషయం చెప్పి రెమ్డెసివిర్, ఇతర ఔషధాలను ఏర్పాటు చేయమని కోరాడు.
సాహిల్ తల్లిని కాపాడటం తన బాధ్యత అని విశ్వసించిన అర్జున్..సమాచారం అందిన తక్షణమే సాహిల్ సూచించిన ఔషధాలు తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా బైక్పైనే బయల్దేరాడు. అలా సుమారు 420 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం 8 గంటల్లోనే అల్వార్కు చేరుకున్నాడు.కొవిడ్పై పోరాటంలో తన సోదరుడి తప్పక విజయం సాధిస్తుందని అర్జున్ బాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన మిత్రుడి కోసం అర్జున్ చేసిన అసాధారణ సాయం గురించి తెలుసుకుని..అల్వారా జిల్లా బీజేపీ నేత సంజయ్ నరుకా, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జితేంద్ర రాఠోడ్ అతణ్ని ప్రశంసించారు. అర్జున్ కు పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.