Chennai Second Airport : చెన్నైలో రూ.20,000 కోట్లతో మరో విమానాశ్రయం నిర్మాణం : సీఎం స్టాలిన్

చెన్నై నగరంలో మరో భారీ విమనాశ్రయం నిర్మించాలని నిర్ణయించామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీని కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నామని వెల్లడించారు.

Chennai Second Airport : చెన్నైలో రూ.20,000 కోట్లతో మరో విమానాశ్రయం నిర్మాణం : సీఎం స్టాలిన్

Chennai Second Airport : చెన్నై నగరంలో మరో భారీ విమనాశ్రయం నిర్మాణం చేయాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇప్పటికే ఓ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కానీ నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కార్గో సేవలకు కూడా డిమాండ్ పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం మరో విమనాశ్రయం నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుందని..ప్రస్తుతం డీపీఆర్ రూపొందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థ టిడ్కో చెన్నై సమీపంలోని పరందూర్ లో నూతన విమానాశ్రయం కోసం స్థలాన్ని అన్వేషిస్తోందని తెలిపారు. రూ.20,000 కోట్ల ఖర్చు అంచనాతో ఈ ఎయిర్ పోర్టును నిర్మించనున్నామని..దీంతో 10 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం స్టాలిన్ వివరించారు.

ఈ విమానాశ్రయంలో 2 రన్ వేలు, ప్రయాణికుల టెర్మినల్ భవనాలు, కార్గో టెర్మినల్, ట్యాక్సీ వేలు, యాప్రాన్ ఉంటాయని వివరించారు. విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడం, సరకు రవాణా రంగంలో ఏర్పడిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.

ప్రభుత్వ ఆధీనంలోని TIDCO మరో విమానాశ్రయం కోసం భూమిని గుర్తించే పనినిలో ఉందని..ఇప్పటికే నాలుగు సైట్‌లను ఎంపిక చేశామని..ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటిలో రెండింటిని సిఫారసు చేసి..చివరకు పరందూర్‌ను ప్రాంతంలో అన్వేషణ జరుగుతోందని స్టాలిన్ వివరించారు.