Chhattisgarh : DRG ఫోర్స్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు ..11 మంది మృతి

Chhattisgarh : DRG ఫోర్స్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు ..11 మంది మృతి

Maoist attack In Dantewada

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు మృతి చెందారు.
మావోయిస్టులు దంతెవాడలో మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 10మంది పోలీసులు..ఓ డ్రైవరు మృతి చెందారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ఫోర్స్ కు చెందినవారిగా గుర్తించారు.

ఈ ఘటనపై సీఎం భూసేష్ బఘేల్ స్పందించారు.డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఫోర్స్ వాహనంపై దాడి జరపటం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు నా సానుభూతి అని ఇటువంటి ఘాతుకాలకు పాల్పడే నక్సల్స్ ను విడిచిపెట్టేది లేదన్నారు. నక్సల్స్ ఏరివేతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా దంతేవాడ జిల్లాలోని అరన్ పూర్ సమీపంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనం లక్ష్యంగా చేసుకుని మందుపాత ఏర్పాటు చేసి అదే మార్గంలో వారి వాహనం వెళ్తుండగా పేల్చినట్లుగా తెలుస్తోంది.

మావోల దాడిలో అమరులైనవారు..
1.రామ్‌కుమార్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్)
2. టికెశ్వర్ ధ్రువ్ (అసిస్టెంట్ కానిస్టేబుల్ కేఫ్, ధామ్తారి)
3. సలిక్ రామ్ సిన్హా(కానిస్టేబుల్, కంకర్)
4. విక్రమ్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్)
5. రాజేష్ సింగ్ (కానిస్టేబుల్,ఘజిపూర్, అప్)
6. రవి పటేల్ (కానిస్టేబుల్)
7. జవన్ అర్జున్ రాజ్‌భర్ (కానిస్టేబుల్)