అన్ని మతాలు ఏకమైన అరుదైన వేదిక..3,229 జంటలు దంపతులైన దృశ్యం..

అన్ని మతాలు ఏకమైన అరుదైన వేదిక..3,229 జంటలు దంపతులైన దృశ్యం..

Mass marriage of 3 thousand 229 couples in Raipur  : ఎక్కువ వివాహం జరిగినా..సందడి..సందడిగా ఉంటుంది. అటువంటిది ఏకంగా ఒకేచోట ఒకే వేదికపై 3,229 వివాహాలు జరిగితే..అదికూడా విభిన్న సంప్రదాయాలతో జరిగితే ఎలా ఉంటుంది. అటువంటి ఓ అరుదైన అపురూపమైన దృశ్యానికి చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ఇండోర్ స్టేడియం వేదికైంది. ఒకేవేదికపై జరిగిన ఈ 3,229 పలు మతాలకు చెందిన జంటలు ఒక్కటయ్యారు. హిందూ, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా పలు సంప్రదాయాలు పలు సంస్కృతుల మధ్య ఈ సీఎం భూపేశ్ భగేల్ సాక్షిగా 3,229 జంటలు ఒక్కటయ్యాయి.

ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భగేల్ కన్యా వివాహ యోజన కింద ఈ వివాహాలను దగ్గరుండి మరీ జరిపించారు. నూతన జంటలకు సీఎం మన్స్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఇంత పెద్ద స్థాయిలో జంటలు ఒకే వేదికపై ఒక్కటై రికార్డు సృష్టించాయి. ఈ వివాహాలు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాయి. ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఈ జంటల్లో అన్ని మతాల వారు ఉండటం. హిందూ, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు ఈ సామూహిక వేడుక ద్వారా ఒక్కటయ్యారు.

చత్తీస్ గఢ్ లోని 22 జిల్లాలకు చెందిన వధూవరులు ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయ్ పూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేలాది జంటల వివాహ కార్యక్రమం గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఈ భారీ పెళ్లి వేడుకను రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సీఎం కన్యా వివాహ యోజన పథకం కింద నిర్వహించింది.