చిదంబరానికి ఊరట…ముందస్తు బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : September 5, 2019 / 09:35 AM IST
చిదంబరానికి ఊరట…ముందస్తు బెయిల్

ఎయిర్ సెల్  మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తికి ఊరట లభించింది. వారిద్దరికీ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక కోర్టు కొన్ని షరతులు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా చిదంబరం దేశం విడిచి వెళ్లకూడదు. విచారణ అధికారులు పిలిచినప్పుడు తప్పకుండా హాజరుకావాలి. అయితే INX మీడియా కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టయిన చిదంబరానికి మాత్రం బెయిల్ దొరకలేదు. 

యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చిదంబరం ఉన్న సమయంలో తన పరిధికి మించి ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ డీల్‌కు ఆమోదం తెలిపారని, దీని వల్ల కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూరిందని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.