Arunachal Pradesh : బరితెగించిన డ్రాగన్..అరుణాచల్ లో మరో 15 గ్రామాలకు చైనా పేర్లు
డ్రాగన్ మరోసారి దందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా
Arunachal Pradesh : డ్రాగన్ మరోసారి దందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా..తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో మరో 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు కాగా… 4 పర్వతాలు, రెండు నదులు, ఓ పర్వత మార్గం ఉన్నాయి. ఈ 15 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, రోమన్ ఆల్పబెట్లతో అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.
8 నివాసిత ప్రాంతాలను… స్నగ్కెజాంగ్, దగ్లుంగ్ జాంగ్, మనిగాంగ్, డుడింగ్, న్యింగ్చి, గోలింగ్, డంబా, మెజాగ్గా నామకరణం చేసింది. నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్జుబ్ రి, కున్మింగ్జింగ్ ఫెంగ్ అని నామకరణం చేసింది. అలాగే రెండు నదులకు జెన్యోగ్మో, దులైన్ అని.. పర్వత మార్గాన్ని ‘సె లా’ అని పేరు పెట్టింది.
అయితే అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే ఆరు ప్రాంతాలకు తమ అధికారిక పేర్లు పెట్టింది. కాగా,ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ను చైనా… ‘జన్గ్నాన్’ అని చైనీస్ పేరుతోనే పిలుస్తోన్న విషయం తెలిసిందే.
ALSO READ Tiger Population 2021: భారత్ లో ఆందోళనకర స్థాయిలో పెద్ద పులుల మృత్యువాత