అందరూ చౌకీదారులేనా! : అంబానీ కోసం చౌకీదార్ మోడీ రాఫెల్ డోర్ తెరిచాడు

ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(మార్చి-19,2019) అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాలకు యూపీఏ ప్రత్యేక హోదా ఇచ్చింది.దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున మేము ఈ పని చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన విధానాలను బీజేపీ పక్కన పెట్టేసింది. జాతీయ పౌర రిజిస్టర్ (NRC) అంశం అరుణాచల్ ప్రదేశ్ను నాశనం చేసే కుట్ర.అరుణాచల్ ప్రదేశ్కి మరిన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది.
Read Also : సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి
మేము మీ సంస్కృతిని నాశనం చేయాలనుకోవడం లేదు.దేశం మొత్తం మీద ఒకే సంస్కృతిని రుద్దాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు భావిస్తున్నాయి.బీజేపీ తమ భావజాలాన్ని ఈశాన్య రాష్ట్రాలపై రుద్దడానికి వీల్లేదు. విద్యావ్యవస్థపై కూడా దాడి జరుగుతోంది. యూనివర్శిటీలకు ఉపకులపతులుగా భాజపా, ఆర్ఎస్ఎస్ తమకు చెందిన వ్యక్తులను నియమిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల తక్కువ ధరకే కొనుగోలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భావించారు. ఇప్పుడు మాత్రం అధిక ధరకు కొంటున్నారు. దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని రాహుల్ ప్రశ్నించారు.
చౌకీదార్ నరేంద్రమోడీ అనిల్ అంబానీకి రూ.30,000కోట్లు దోచిపెట్టేందుకు రాఫెల్ డోర్ ఓపెన్ చేశాడని ఆరోపించారు. అప్పట్లో తాను ఒక్కడినే చౌకీదార్ నని చెప్పిన ఆయన ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ అన్నారు.కాంగ్రెస్ ముక్త్ భారత్ అని మోదీ అన్నారని, ఆయన హృదయంలో ద్వేషం ఉందన్నారు. తాము మాత్రం ఎవరినీ నాశనం చేయాలని భావించట్లేదని రాహుల్ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో మోడీ తన ప్రచారానికి సంబంధించిన ఫొటోలు తీసుకుంటూ బిజీగా గడిపారన్నారు. మోదీ దృష్టిలో అభివృద్ధి అంటే పెద్దనోట్లను రద్దు చేయడం. ఇది తెలివితక్కువ చర్య అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడన్నారు.
Read Also : నడిరోడ్డుపై జవాన్ ని కాల్చేశారు
- Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
- Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
- Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
- Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?
1Pawan kalyan: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
2Nityananda swamy : నిత్యానందకి ఏమైంది..?తానే దేవుడినని ప్రకటించుకున్న స్వామికి వింత జబ్బు..27 మంది వైద్యులతో చికిత్స..!
3Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
4Telangana : గులాబీకి షాక్..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!
5Accident: ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
6Disha Encounter: ‘దిశ’ కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన రేపే..
7Rajya sabha : యూపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేత..మురళీధర్ రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్
8AP Politics : ‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య లెటర్
9Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
10Taliban Promise: ఇదేనట గుడ్ న్యూస్.. కొంటె మహిళలను ఇళ్లలోనే ఉంచుతామంటోన్న తాలిబాన్లు
-
CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన