Karnataka : ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మై కుక్కపిల్లలా వణుకుతారు : సిద్ధరామయ్య

ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు ఆపార్టీ నేతలు అంతా కుక్కపిల్లలా వణుకుతారు అంటూ కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Karnataka : ప్రధాని మోడీ ముందు సీఎం బసవరాజ్ బొమ్మై కుక్కపిల్లలా వణుకుతారు : సిద్ధరామయ్య

CM Basavaraj Bommai shivers like puppy

Karnataka : ప్రధాని మోడీ ముందు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు ఆ రాష్ట్ర బీజేపీ నాయకులంతా ‘కుక్కపిల్లలే’నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం సిద్దరామయ్య. ప్రధాని ముందు వారంతా వణికిపోతుంటారని అన్నారు. మంగళవారం (జనవరి 3,2023) పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్‌ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసిందని..అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రానికి ఇవ్వలేదని..ఈ విషయాలను ప్రధాని మోడీ ముందు ప్రస్తావించటానికి సీఎం బసవరాజ్ బొమ్మైకు గానీ కర్ణాటక బీజేపీ నేతలకు దమ్మూ ధైర్యం లేదని మోడీ ముందు సీఎం కూడా కుక్కపిల్లలా వణకాల్సిందేనని వ్యాఖ్యానించారు.

 

సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా సీఎం బసవరాజ్ బొమ్మై స్పందన ఏంటని అడుగగా ఆయన సానుకూలంగా స్పందించారు. మమ్మల్ని కుక్కలతో పోల్చటాన్ని సానుకూలంగానే తీసుకుంటున్నామని ఎందుకంటే కుక్కకు విశ్వాసం ఉంటుంది. కుక్క నమ్మకమైన జంతువు. నేను కర్ణాటక ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తున్నాను కాబట్టి వారు నన్ను కుక్క అని పిలిచినా నాకు కోపంలేదని అన్నారు.