ధోని వీడ్కోలు మ్యాచ్ జరపండి.. బిసిసిఐకి సీఎం లేఖ!
భారత జట్టు మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. అయితే గతేడాది న్యూడిలాండ్తో చివరి మ్యాచ్ ఆడిన ధోని ఆ తర్వాత జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్నూ ఆడలేదు. దీంతో ధోనికి గొప్పగా వీడ్కోలు పలికేందుకు అతని స్వస్థలం రాంచీలో ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి లేఖ రాశారు.
జార్ఖండ్ ఆతిథ్యం ఇవ్వబోయే ఈ చివరి మ్యాచ్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుందని ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ రాంచీలో నిర్వహించాలంటూ ఆయన లేఖలో కోరారు. ‘ఇక 7వ నెంబర్ జెర్సీలో హెలికాప్టర్ షాట్లు క్రికెట్ స్టేడియంలో కనిపించవు. దేశానికి, జార్ఖండ్కు ఎన్నో గర్వించదగ్గ విజయాలను ఇచ్చిన ధోనికి గొప్పగా విడ్కోలు పలుకుదాం అంటూ’ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.
జార్ఖండ్లోని రాంచీలో ఒక చిన్న కుటుంబం నుండి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని చాలా సాధారణ కుటుంబంలో పెరిగాడు. ధోని కెరీర్లో కూడా చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. అటువంటి ధోనికి అరుదైన గౌరవం ఇవ్వాలని సీఎం కోరుతున్నారు.
देश और झारखण्ड को गर्व और उत्साह के अनेक क्षण देने वाले माही ने आज अंतराष्ट्रीय क्रिकेट से सन्यास ले लिया है।हम सबके चहेते झारखण्ड का लाल माही को नीली जर्सी पहने नहीं देख पायेंगे।पर देशवासियों का दिल अभी भरा नहीं। मैं मानता हूँ हमारे माही का एक फ़ेयरवेल मैच राँची में हो जिसका 1/2 pic.twitter.com/XFt5zBSvG8
— Hemant Soren (घर में रहें – सुरक्षित रहें) (@HemantSorenJMM) August 15, 2020