Sonia Gandhi : దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న మోదీ ప్రభుత్వం : సోనియా గాంధీ
దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలన్నారు.

Sonia Gandhi : ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీ, గిరిజనుల పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ లో సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. మోడీ పాలన కొనసాగితే దేశం దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
చింతన్ శివిర్ వేదిక ద్వారా పార్టీ ఐక్యత, దేశ సమగ్రత, ఆత్మ విశ్వాసం, నిబద్దతతో ముందుకు వెళుతున్నాం.. అనే సందేశం వెళ్ళాలి అని సోనియాగాంధీ పిలుపునిచ్చారు. దేశాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ మతప్రాతిపదికన విభజించేందుకు పూర్తిస్థాయి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. దేశంలో ఉన్న మైనారిటీలను టార్గెట్ చేసి దాడులు పెంచారని విమర్శించారు. మైనారిటీలు కూడా దేశంలో ఒక భాగం అన్న విషయాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతలపైకి విచారణ సంస్థలను ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గాంధీని చంపిన వారిని కీర్తి ప్రతిష్టలతో పొగుడుతూ హీరోలుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.
Sonia Gandhi: ప్రజాస్వామ్యానికి ఫేస్ బుక్ ప్రమాదకరం – సోనియా గాంధీ
నెహ్రూ నెలకొల్పిన సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తూ వ్యవస్థలపై ఉన్న జ్ఞాపకాలను తుడిచేస్తున్నారని మండిపడ్డారు. సెక్యులరిజంపై దాడి చేస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలు, దళితులు, మహిళలపై రోజు రోజుకీ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని కార్పొరేషన్ చేస్తూ అన్ని వర్గాల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా జీవించాలి… అందుకు అనుగుణంగా వాతావరణం పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. అందుకు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
2016 నుంచీ దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారి పోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. MSMEలు తీవ్రంగా నష్ట పోయాయని తెలిపారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని, జాతీయ భద్రతా చట్టాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల పోరాటానికి దిగి వచ్చి.. నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నా… సమస్యలు పరిష్కారం మాత్రం కాలేదన్నారు.
Sonia Gandhi: 400మందితో సిడబ్ల్యుసి సమావేశానికి సోనియాగాంధీ
మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో విద్వేష వాతావరణాన్ని పెంచుతున్నారని విమర్శించారు. దీని వల్ల సమాజంలో తీవ్రమైన దుష్పరిణామాలు వస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సామరస్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక,రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై బృందాలుగా కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారభించారు. చర్చలు బయటకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చర్చలు జరిగే ప్రాంతంలోకి నేతల ఫోన్లకు అనుమతి లేదు. మూడు రోజుల పాటు చింతన్ శివిర్ సాగనుంది.
- TS Politics : కాంగ్రెస్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ ఫార్మలాతో..తెగ టెన్షన్ పడిపోతున్న తెలంగాణ సీనియర్ నేత
- P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, ఆఫీస్లపై సీబీఐ దాడులు
- Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
- Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
- Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
1Neeraj Wife Sanajana : నన్ను, నా బాబుని కూడా చంపేస్తారు.. పోలీసులు పట్టించుకోలేదు- నీరజ్ భార్య సంజన
2Aishwarya Rajesh: చీరకట్టులో చూపులు తిప్పుకోనివ్వని ఐశ్వర్య రాజేష్
3Electric Buses: ఢిల్లీ వాసులకు ఆ 150 బస్సుల్లో ఉచిత ప్రయాణం
4Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
5Ukrainian Court : యుద్ధ నేరాల్లో తొలి శిక్ష.. రష్యా సైనికుడికి జీవితఖైదు విధించిన యుక్రెయిన్ కోర్టు
6Tiruchanur : జూన్ 10 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు
7Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
8KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
9Lion Bites Finger: సింహం బోనులో వేలుపెట్టాడు.. కొరికేసింది
10Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
-
Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
-
Akasa Airlines: రాకేశ్ ఝున్జున్వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
-
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
-
Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
-
Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
-
Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
-
Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్యూ పరిశోధకులు
-
Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు