విద్యార్థులతో రాహుల్ గాంధీ ఫుషప్స్, వీడియో వైరల్

విద్యార్థులతో రాహుల్ గాంధీ ఫుషప్స్, వీడియో వైరల్

Rahul push-ups : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేస్తున్నారు. వారిలో సరదాగా మాట్లాడుతున్నారు. మొన్న మత్స్యకారులతో మాట్లాడుతూ..సముద్రంలో ఈత కొట్టి..వలతో చేపలను పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా..విద్యార్థులో కలిసి ఫుష్ అప్స్ కొట్టడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటిస్తూ…ప్రత్యర్థులపై విమర్శలు చేయడం పరిపాటి. కానీ..ఈసారి రాహుల్ గాంధీ రూట్ మార్చారు. తన స్టైల్ ను పక్కన పెట్టేశారు. వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధ వంటకాలతో అలరించే విలేజ్ కుకింగ్ చానల్ బృందంతో కలిసి గడిపిన రాహుల్..కన్యాకుమారిలో పర్యటించారు.

ములగుమూడుబన్ ఏరియాలో సెయింట్ జోసెఫ్ స్కూళ్లో విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. దీంతో విద్యార్థులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అనంతరం ఓ విద్యార్థినితో కలిసి ఫ్లోర్ పై పుష్ అప్స్ చేశారు. ఒంటి చేత్తో చేయాలని సూచించారు. అన్నట్లుగానే..రాహుల్ ఒక చేతితో డిప్స్ కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జపాన్ చెందిన మార్షల్ ఆర్ట్స్ కళ అయిన ఐకిడోను ప్రదర్శించారు. నృత్యాలు కూడా చేశారు. ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రిపై రాహుల్ విమర్శలు గుప్పించారు.