గిఫ్ట్ గా ఇచ్చిన గుర్రంతో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున..ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Jharkhand Assembly : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున..ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. సైకిల్, బైక్, నడుచుకుంటూ..ఇలా రాలేదు. ఏకంగా గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ రావడం విశేషం. గుర్రాన్ని ఒకతను గిఫ్ట్ గా ఇచ్చారని సదరు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆమె ఎవరో కాదు..ఆ రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే అంబా ప్రసాద్.
రార్ఖండ్ రాష్ట్రంలో బార్కగావ్ నియోజకవర్గం నుంచి 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అంబా ప్రసాద్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 31 సంవత్సరాలున్న ఈమె 2021, మార్చి 08వ తేదీ సోమవారం గుర్రంతో అసెంబ్లీకి వచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ కల్నల్ రవి రాఠోడ్.. ఈ గుర్రాన్ని కానుకగా ఇచ్చారని తెలిపారు అంబా ప్రసాద్. ఎమ్మెల్యే గుర్రంపై రావడంతో ప్రజలు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యాయి.
Jharkhand: Congress MLA Amba Prasad arrives at the Assembly riding a horse in Ranchi.
“This horse has been gifted to me by Colonel (retired) Ravi Rathore on the occasion of #InternationalWomensDay,” she says. pic.twitter.com/fwBnoAzAuG
— ANI (@ANI) March 8, 2021