Covid-19 Test: గోవా నుంచి బయల్దేరిన షిప్ లో 66మందికి కొవిడ్ పాజిటివ్

కార్డెలియా క్రూయిస్ షిప్ లో ప్రయాణిస్తున్న 66మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కన్ఫామ్ అయింది. మంగళవారానికి ముంబై చేరుకుంటుండటంతో ఆ తర్వాత మరింత మందికి టెస్టులు నిర్వహిస్తారు...

Covid-19 Test: గోవా నుంచి బయల్దేరిన షిప్ లో 66మందికి కొవిడ్ పాజిటివ్

Cruise Ship

Covid-19 Test: కార్డెలియా క్రూయిస్ షిప్ లో ప్రయాణిస్తున్న 66మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కన్ఫామ్ అయింది. మంగళవారానికి ముంబై చేరుకుంటుండటంతో ఆ తర్వాత మరింత మందికి టెస్టులు నిర్వహిస్తారు. మొత్తం షిప్ లో 2వేల మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది.

‘మంగళవారం సాయంత్రానికి షిప్ ముంబైకు చేరుకోవాల్సి ఉంది. దాంతో పాటు షిప్ లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ – 19 పరీక్షలు చేయిస్తాం. ప్రయాణిస్తున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం. అక్కడ పాజిటివ్ ఫలితాలు వస్తే హాస్పిటల్ కు పంపి క్వారంటైన్ లో ఉంచుతాం’ అని బీఎంసీ అధికారి వెల్లడించారు.

గోవా హెల్త్ మినిష్టర్ విశ్వజిత్ రాణె మాట్అలాడుతూ.. కార్డియోలా క్రూయిజ్ షిప్ లో ఉన్నవారి 2వేల శాంపుల్స్ తీసుకుని పరీక్ష జరిపితే 66మందికి పాజిటివ్ వచ్చింది ముంబై చేరుకున్నాక మరోసారి పరీక్షలు జరుపుతాం. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఇదే సమాచారాన్ని పంపించాం’ అని రాణె ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

ఈ షిప్ లోనే షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. గడిచిన 24గంటల్లో ఇండియాలో 37వేల 379 కరోనా కేసులు నమోదుకాగా, రోజువారీ 3.24శాతంగా కనిపిస్తుందని కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.