ఉదయపూర్ స్కూల్ లో 25మంది అంధ విద్యార్థులకు కరోనా
udaipur: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పుర్లో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఉదయ్పుర్ అంబమాత పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజ్ఞచక్షు స్కూల్ లోని 25మంది అంధ విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది.
ప్రజ్ఞచక్షు అంధుల స్కూల్ లోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కరోనా నిర్ధరణ కాగా… విద్యార్థులు అందరికీ పరీక్షలు చేయించింది యాజమాన్యం. దీంతో 25మందికి కరోనా సోకినట్లు శుక్రవారం తేలింది. విషయం అందుకున్న వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ టీమ్ లు, జిల్లా కలెక్టర్ చేతన్ దేవరా, ఎస్పీ హాస్టల్కు వెళ్లారు. వైరస్ సోకిన విద్యార్థులను ఒక భవనంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన విద్యార్థులను మరో చోటు ఉంచారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.