Corona : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Corona : దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో 20వేలకు దిగువన నమోదైన కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక మృతుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 277 మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది.
28,246 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,48,339గా ఉంది. ఇక వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 89,02,08,007 మందికి కరోనా టీకా ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి టీకా వేశారు. ఇక త్వరలో చిన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ టీకా అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం కానుంది.
Read More : NITI Aayog Report : జిల్లా హాస్పిటల్స్ లో లక్ష జనాభాకి 24 బెడ్స్..బీహార్ లో 6 మాత్రమే