24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

  • Published By: srihari ,Published On : May 28, 2020 / 08:45 AM IST
24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. రాష్ట్రంలో పోలీసులపై పంజా విసిరింది. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ లో రోజురోజుకూ కరోనా కేసుల పెరుగుతున్నాయి. 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. ఇద్దరు పోలీసులు కరోనాతో మృతి చెందారు. 

ఇప్పటివరకు 2095 మంది పోలీసులకు కరోనా సోకింది. కరోనా మృతుల సంఖ్య 22కు పెరిగింది. 897 మంది పోలీసులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 56 వేల 948 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1897 మంది కరోనాతో మరణించారు. 

రాష్ట్రంలో కరోనా నుంచి 17 వేల 918 మంది కోలుకున్నారు. 18 వేల 545 పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 15 వేల 257 పాజిటివ్ కేసులతో మూడోస్థానంలో ఢిల్లీ ఉంది. 

Read: పెళ్లి మండపం నుంచే క్వారంటైన్ కు వెళ్ళిన కొత్త దంపతులు