పెళ్లైన మూడు రోజులకే వరుడికి కరోనా పాజిటివ్

  • Published By: bheemraj ,Published On : June 15, 2020 / 09:09 PM IST
పెళ్లైన మూడు రోజులకే వరుడికి కరోనా పాజిటివ్

పెళ్లైన మూడు రోజులకే వరుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో వధువు, పెళ్లికి హాజరైన 63 మంది బంధువులు క్వారంటైన్ కు వెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో జరిగింది. అయితే పెళ్లికి ముందు వరుడికి కరోనా పరీక్ష చేయగా నెగెటివ్ తేలింది. పెళ్లైన మూడు రోజులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

దీంతో వధువు, బంధువులను క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాల్ఘర్ లో ఇప్పటివరకు 1911 మందికి కరోనా బారిన పడ్డారు. 61 మంది చనిపోయారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు లక్షా 7 వేల 958 మందికి కరోనా వైరస్ 
సోకింది. వైరస్ తో 3950 మంది మృతి చెందారు. 

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర కరోనాకు కేంద్ర బింధువు అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు భయం గుప్పిట్లో బతుకున్నారు.