Coronavirus India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మూడో వేవ్ ముగుస్తోంది

దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

Coronavirus India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..  మూడో వేవ్ ముగుస్తోంది

Corona

Coronavirus India: దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 44 వేల 877 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 684 మంది చనిపోగా.. అంతకుముందు రోజు 50వేల 407 కేసులు నమోదయ్యాయి. దేశంలో పాజిటివిటీ రేటు 3.17కి పెరిగింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల 37 వేల 45కి తగ్గాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇప్పుడు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షల 37 వేల 45కి తగ్గగా.. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5 లక్షల 8 వేల 665కు పెరిగింది. ఇప్పటివరకు 4 కోట్ల 15 లక్షల 85 వేల 711 మంది కరోనా సోకి కోలుకున్నారు.

కరోనా మూడో వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీలో వెయ్యి కంటే తక్కువ 920 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13 మంది కరోనా కారణంగా మరణించారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాజధానిలో కరోనా రేటు 1.68 శాతానికి తగ్గింది. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 18లక్షల 50వేల 516కి పెరగ్గా, మరణాల సంఖ్య 26వేల 60కి చేరుకుంది.

172 కోట్ల డోస్‌లు:
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 172 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ఇవ్వగా.. నిన్న ఒక్కరోజే 49 లక్షల 16 వేల 801 డోసులు ఇచ్చింది ప్రభుత్వం. దేశమంతా ఇప్పటివరకు 172 కోట్ల 81 లక్షల 49 వేల 447 డోసుల వ్యాక్సిన్‌ అందించారు.