ఏప్రిల్-15నుంచి రైల్వే,ఎయిర్ లైన్ బుకింగ్ ప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 03:32 PM IST
ఏప్రిల్-15నుంచి రైల్వే,ఎయిర్ లైన్ బుకింగ్ ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే రోజు ఏప్రిల్ 15 నుండి భారత రైల్వే మరియు ప్రధాన విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి.

ఏప్రిల్ 14 తర్వాత దాటిన తర్వాత లాక్ డౌన్ పొడిగించబడదని కేంద్రం నుండి స్పష్టమైన సూచన ఉన్నందున,బుకింగ్స్ ప్రారంభమయ్యాయని వెస్ట్రన్ రైల్వేలోని అహ్మదాబాద్ డివిజన్ PRO ప్రదీప్ శర్మ బుధవారం(ఏప్రిల్-1,2020)తెలిపారు.

21 రోజుల వ్యవధికి మించి లాక్‌డౌన్‌ను విస్తరించే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినందున, విమాన, టూర్ బుకింగ్‌ల కోసం తాము విచారణ తీసుకుంటున్నామని ట్రావెల్ బుకింగ్ ఏజెంట్లను చెబుతున్నట్లు పలు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.