రూటు మార్చిన పతాంజలి.. కరోనాకు మందు కనిపెట్టలేదు

రూటు మార్చిన పతాంజలి.. కరోనాకు మందు కనిపెట్టలేదు

పతాంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇటీవల కరోనా వైరస్ కు మందు అంటూ ప్రకటించి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఆ రోజు ప్రకటనను విశ్లేషిస్తూ కరోనావైరస్ పేషెంట్స్ వాడే మెడిసిన్ తయారుచేశామని క్లినికల్ ట్రయల్స్ లో ఉందని.. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు.

‘తులసీ గిలోయ్ అశ్వగంధ అడ్వాన్స్ డ్ లెవల్, క్లినికల్ ట్రయల్స్ కొవిడ్ 19 పేషెంట్స్ పై ప్రయోగించామని అన్నారు. దానికి పేషెంట్లు కోలుకున్నారని.. మాకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. ఆయుష్ మినిస్ట్రీ మరోసారి క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే దానికి మేం రెడీగా ఉన్నామని అన్నారు బాలకృష్ణ.

జూన్ 23న పతాంజలి కరోనిల్, శ్వాసరిని లాంచ్ చేయనున్నారు. ఇది కొవిడ్ 19 తగ్గించడానికి 100 శాతం అనుకూల ఫలితాలు ఇస్తుందని.. పతాంజలి యోగ్ పీఠ్ హరిద్వార్ అన్నారు. కొవిడ్ 19 టెస్టులు పతాంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జైపూర్ సంయుక్తంగా నిర్వహించింది.

పతాంజలి ఆధ్వర్యంలో కరోనా కిట్ కూడా రెడీ కానుందని.. కేవలం రూ.545కే వారంలోగా తయారు అవుతుందని అన్నారు. మరో 30రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటుందని అన్నారు.