Deve Gowda : మాజీ ప్రధాని దేవెగౌడకి రూ.2కోట్ల జరిమానా
పరువు నష్టం కేసులో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్డీ దేవెగౌడకి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది.
Deve Gowda పరువు నష్టం కేసులో మాజీ ప్రధాన మంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్డీ దేవెగౌడకి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్ (నైస్) లిమిటెడ్కు దేవెగౌడ రూ.2కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
2012లో నైస్ సంస్థపై దేవగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సంస్థ పరువుకు భంగం వాటిల్లిందని ఆ కంపెనీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన సివిల్ కోర్ట్ జడ్జి మల్లన గౌడ..దౌవెగౌడ రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
అయితే, ఇదే కేసులో గతంలో ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై రూ.10కోట్ల నష్ట పరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించిన సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు..విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.