COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 20,821 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 0.05 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. రికవరీ రేటు 98.77 శాతంగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,892గా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,40,97,072గా ఉన్నట్లు తెలిపింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదు

india corona cases

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 20,821 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 0.05 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. రికవరీ రేటు 98.77 శాతంగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,892గా ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,40,97,072గా ఉన్నట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.06 శాతంగా ఉన్నట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 219.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

వాటిలో రెండో డోసుల సంఖ్య 95.01 కోట్లు, బూస్టర్ డోసుల సంఖ్య 22.05 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో 1,22,555 కరోనా డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు 90.04 కోట్ల కరోనా పరీక్షలు చేశామని తెలిపింది. నిన్న 1,44,491 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..