COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,557 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,91,906 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా ఉన్నట్లు వివరించింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.95 శాతం ఉన్నట్లు చెప్పింది. యాక్టివ్ కేసుల సంఖ్య 23,193 ఉన్నట్లు తెలిపింది.

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదు

Corona cases

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,557 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,91,906 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా ఉన్నట్లు వివరించింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.95 శాతం ఉన్నట్లు చెప్పింది.

యాక్టివ్ కేసుల సంఖ్య 23,193 ఉన్నట్లు తెలిపింది. కరోనా రికవరీ శాతం 98.76 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 219.56 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. వాటిలో 95 కోట్ల రెండో డోసులు ఉన్నాయని, 22.03 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నాయని చెప్పింది.

నిన్న దేశంలో 42,864 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 90.01 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. నిన్న 87,905 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..