Odisha hospital : వీళ్లు మనుషులేనా ? కోవిడ్ వార్డులో మహిళపై అత్యాచారయత్నం

2021, ఏప్రిల్ 26వ తేదీన కరోనా సోకి..నుపాడ జిల్లా ఆసుపత్రిలో మహిళ అడ్మిట్ అయ్యింది. అదే ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్నారు.

Odisha hospital : వీళ్లు మనుషులేనా ? కోవిడ్ వార్డులో మహిళపై అత్యాచారయత్నం

Covid

Covid Positive : : భారతదేశంలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. దేశ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొంటుంటే కామాంధులు రెచ్చిపోతున్నారు. కన్నుమిన్ను గానక ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ వ్యాధితో బాధ పడుతున్న వారిపై దారుణాలకు తెగపడుతున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళపై కామాంధుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

2021, ఏప్రిల్ 26వ తేదీన కరోనా సోకి..నుపాడ జిల్లా ఆసుపత్రిలో మహిళ అడ్మిట్ అయ్యింది. అదే ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఆ మహిళపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ చికిత్స పొందుతున్న ఇతరులు ఆస్పత్రి సిబ్బంది చేరుకుని ఆమెను రక్షించారు.

వీళ్లు మనుషులేనా ? కోవిడ్ వార్డులో మహిళపై అత్యాచారయత్నంతన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, రక్షించుకునేందుకు కేకలు వేయడంతో తోటి రోగులు రక్షించారని బాధితురాలు వెల్లడించింది. ఆసుపత్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని మరో కోవిడ్ సెంటర్ కు తరలించినట్లు వెల్లడించారు.

Read More : Telangana : ఈటలపై వేటు..మంత్రివర్గం నుంచి బర్తరఫ్