COVID Variant BF.7 : బీ కేర్ ఫుల్.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్న కేంద్రం, మాస్క్ మస్ట్ అని ఆదేశం

కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని లోక్ సభలో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొత్త వైరస్ బీఎఫ్.7 పై అప్రమత్తంగా ఉండాలని మాండవియా హెచ్చరించారు.

COVID Variant BF.7 : బీ కేర్ ఫుల్.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్న కేంద్రం, మాస్క్ మస్ట్ అని ఆదేశం

COVID Variant BF.7 : కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని లోక్ సభలో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొత్త వైరస్ బీఎఫ్.7 పై అప్రమత్తంగా ఉండాలని మాండవియా హెచ్చరించారు.

అన్ని రాష్ట్రాలు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాల్సిన అవసరం ఉందని, అలాగే కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రపంచంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న ఆయన.. భారత్ లో మాత్రం కోవిడ్ అదుపులోనే ఉందని చెప్పారు. మళ్లీ ప్రజలందరూ కూడా కరోనా కనీస జాగ్రత్తలు తప్పక పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు దేశంలో కొత్త రకం ఒమిక్రాన్ వైరస్ వెలుగుచూడటంతో కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది.

Covid19: ఇండియాలో మళ్లీ లాక్‭డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

మరోవైపు దేశంలో కొవిడ్ పరిస్థితి, కొత్త వేరియంట్ల కట్టడిపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. కీలక మంత్రిత్వశాఖల మంత్రులు, కేంద్ర ఆరోగ్య శాఖ, పీఎంవో అధికారులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ల కట్టడికి సన్నద్ధత, రాష్ట్రాలను అప్రమత్తం చేయడం, కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రధానికి వివరణ ఇవ్వనున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.

కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో.. మరోమారు మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లోనూ ఆందోళనలు నెలకొన్నాయి. చైనాలో కరోనా ఉధృతికి కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ భారత్ లోనూ వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

Covid Tests In Airports : మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ.. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు

గత 24 గంటల వ్యవధిలో అమెరికా, జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాల్లో 5.37 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ఐఎంఏ వెల్లడించింది. గత 24 గంటల్లో భారత్ లో 145 పాజిటివ్ కేసులు నమోదైతే, వాటిలో నాలుగు కేసులు బీఎఫ్-7 వేరియంట్ కు చెందినవని తెలిపింది. అయితే దేశంలో భారీ మౌలిక సదుపాయాలు, ప్రైవేటు రంగం వనరులు, అంకితభావంతో కూడిన వైద్య సిబ్బంది, క్రియాశీలక నాయకత్వం, తగినన్ని ఔషధాలు, వ్యాక్సిన్లతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని ఐఎంఏ పేర్కొంది. గతంలో ఇది నిరూపితమైందని తెలిపింది.

దేశంలో ఇప్పటికప్పుడు ప్రమాదకర పరిస్థితులేవీ లేవని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐఎంఏ అభిప్రాయపడింది. అయినప్పటికీ జాగ్రత్తపడడం మంచిదంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రజలకు ఐఎంఏ సూచనలు..
* బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
* భౌతికదూరం పాటించాలి.
* సబ్బు, శానిటైజర్లతోనూ క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి.
* వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలకు దూరంగా ఉంటే మంచిది.
* అంతర్జాతీయ ప్రయాణాలు చేయరాదు.
* జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
* వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే టీకా తీసుకోండి.
* ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించండి.