జైలులో ఖైదీ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోన్లు మాట్లాడుకుంటూ ఎంజాయ్
మర్డర్ కేసులో ఖైదీగా శిక్ష అనుభవిస్తోన్న పింటూ తివారి అనే షార్ప్ షూటర్ జైలులో ఘనంగా బర్త్ డే పార్టీ చేసుకున్నారు. బీహార్లోని సితామరి జైలులో ఘటన చోటుచేసుకుంది. జైలులో ఖైదీ బర్త్ డే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పింటూ తివారి తన బర్త్ డే రోజున జైలులో కేక్ కట్ చేయగా, తోటి ఖైదీలు అతడికి పుట్టిన రోజు గిఫ్ట్ లు అందచేయడాన్ని పరిశీలిస్తే, అక్కడి జైలులో ఖైదీలకు, జైలు సిబ్బందికి మధ్య ఎంత సత్సంబంధాలు ఇట్టే అర్థమైపోతుంది. పింటూ తివారి బర్త్ డే పార్టీలో తోటి ఖైదీలకు మటన్తో విందు ఏర్పాటు చేయగా.. ఆ విందులో పాల్గొన్న ఖైదీలు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి సిబ్బంది అందిస్తున్న ఈ రాజభోగాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో పింటూ తివారి బర్త్ డే పార్టీ కాస్తా జైలు అధికారుల మెడకు చుట్టుకుంది. దీంతో జైలులో నలుగురు సెక్యురిటీ గార్డులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 2015లో బీహార్లోని దర్భంగలో ఇద్దరు ఇంజనీర్లను హత్య చేసిన కేసులో పింటూ తివారి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
Bihar: Four guards of the jail have been suspended in connection with the incident where a criminal Pintu Tiwari, in a video, was seen celebrating his birthday inside the jail premises. https://t.co/pE41NLJc7N
— ANI (@ANI) September 1, 2019