CRIS : దేశవ్యాప్తంగా తప్పిన పెద్ద ముప్పు..15 రాష్ట్రాల్లో వందల రైళ్లు ఆగిపోయే పరిస్థితి

దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థలో పెద్ద ఆటంకం తప్పింది. సికింద్రాబాద్‌ రైల్వే డిజాస్టర్‌ రికవరీ కేంద్రం అప్రమత్తత కారణంగా ఇది సాధ్యమైంది. దాదాపు 15 రాష్ట్రాల్లో రైల్వే టిక్కెట్ల జారీ, రిజర్వేషన్‌ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆటంకం కలగకుండా నిలువరించడం ద్వారా వందల రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయే ప్రమాదం తప్పింది.

CRIS : దేశవ్యాప్తంగా తప్పిన పెద్ద ముప్పు..15 రాష్ట్రాల్లో వందల రైళ్లు ఆగిపోయే పరిస్థితి

Cris

CRIS recovers data lost in fire at Kolkata rail booking centre: దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థలో పెద్ద ఆటంకం తప్పింది. సికింద్రాబాద్‌ రైల్వే డిజాస్టర్‌ రికవరీ కేంద్రం అప్రమత్తత కారణంగా ఇది సాధ్యమైంది. దాదాపు 15 రాష్ట్రాల్లో రైల్వే టిక్కెట్ల జారీ, రిజర్వేషన్‌ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆటంకం కలగకుండా నిలువరించడం ద్వారా వందల రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయే ప్రమాదం తప్పింది. ఆరు రైల్వే జోన్లకు అనుసంధానంగా ఉన్న సికింద్రాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టం (క్రిస్‌)లోని డిజాస్టర్‌ రికవరీ కేంద్రం ఈ ఉపద్రవాన్ని తప్పించింది. రిజర్వేషన్ల టిక్కెటింగ్‌ వ్యవస్థతో పాటు రైల్వేకు సంబంధించి ఇతర సాంకేతిక వ్యవస్థను క్రిస్‌ పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైల్లో ఈ కేంద్రాలున్నాయి. చెన్నై కేంద్రానికి అనుబంధంగా ప్రాంతీయ కేంద్రం సికింద్రాబాద్‌లో ఉంది.

ఏం జరిగింది? ఎలా ఎదుర్కొన్నారు?
కోల్‌కతాలో రైల్వేకు సంబంధించిన 13 అంతస్తుల భవనంలో మార్చి 8న సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 9 మంది చనిపోయారు. ఈ భవనంలోనే క్రిస్‌ సమాచార కేంద్రం ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కేంద్రంతో పాటు రైల్వేకు సంబంధించి అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరాతోపాటు ఇతర సేవలన్నింటినీ నిలిపివేశారు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ల కేంద్రాలతోపాటు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ పూర్తిగా నిల్చిపోయింది. జనరల్‌ టికెట్ల విక్రయాలు ఆగిపోయాయి.

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. గోదావరి, ఈస్ట్‌కోస్ట్‌, విశాఖ, హౌరా బండ్లపైనా ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. దీంతో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే సికింద్రాబాద్‌ క్రిస్‌ ప్రాంతీయ కేంద్రం జీఎం రవిప్రసాద్‌ పాడిని అప్రమత్తం చేశారు. వెంటనే ఆయనతోపాటు ఇతర సాంకేతిక సిబ్బంది మూడున్నర గంటలపాటు కష్టపడి 15 రాష్ట్రాల్లో రైల్వే సేవలకు అంతరాయం కలగకుండా చేశారు. ఆరు జోన్లలోని రిజర్వేషన్‌ కేంద్రాలను ఈ డిజాస్టర్‌ డేటా సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఆటంకాన్ని ఆపగలిగారు. ఆ రోజు రాత్రి నుంచి 13వ తేదీ తెల్లవారుజాము వరకు వ్యవస్థలన్నీ ఈ కేంద్రం ద్వారానే పని పనిచేశాయి. 24 గంటలూ ఉద్యోగులు విధులు నిర్వర్తించారు.