BJP MP Varun Gandhi : పగలు భారీ ర్యాలీలు,రాత్రి కర్ఫ్యూలు..సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ సెటైర్లు

ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్ కట్టడిలో" భాగంగా పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కూడా నైట్ కర్ఫ్యూ విధించడంపై

BJP MP Varun Gandhi : పగలు భారీ ర్యాలీలు,రాత్రి కర్ఫ్యూలు..సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ సెటైర్లు

Varun

BJP MP Varun Gandhi : ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్ కట్టడిలో” భాగంగా పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కూడా నైట్ కర్ఫ్యూ విధించడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించారు. పగలు ఎన్నికల ర్యాలీలు,రాత్రి పూట కర్ఫ్యూలు అంటూ సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు వరుణ్ గాంధీ.

ఈ మేరకు సోమవారం ఓ ట్వీట్ లో వరుణ్ గాంధీ…రాత్రి పూట కర్ఫ్యూ విధించడం,పగటి పూట లక్షలాది మందిని ర్యాలీలకు పిలవడం సామాన్యుడికి అర్థం కాని విషయం. ఉత్తరప్రదేశ్ యొక్క పరిమిత ప్రజారోగ్య వ్యవస్థ దృష్ట్యా, ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడమా లేక,ఎలక్టోరల్ పవర్ చూపించడమా ఏది మన ప్రాధాన్యత అన్నది మనం నిజాయితీగా నిర్ణయించాలి”అని పేర్కొన్నారు.

కాగా, గత కొద్ది నెలలుగా వరుణ్ గాంధీ సొంత పార్టీ నాయకత్వంపైనే బహిరంగ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. యూపీలో యోగి సర్కార్ తో పాటు,కేంద్రంలోని మోదీ సర్కార్ పై కూడా పలు సందర్భాలలో తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు వరుణ్ గాంధీ.

మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అయితే నెల రోజుల వ్యవధిలో పది సార్లు యూపీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక,సమాజ్ వాదీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ఒమిక్రాన్,కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో భారీ ఎన్నికల ర్యాలీల కారణంగా మళ్లీ ప్రమాదకర పరిస్థితులు ముంచుకొచ్చే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ Kesineni Nani : గన్నవరం ఎయిర్‌పోర్టుపై కేంద్ర మంత్రికి లేఖ రాసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

ALSO READ Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..యూపీలో నైట్ కర్ఫ్యూ