రూ. 20 ఇడ్లీ కోసం గొడవ..ఒకరిని చంపేశారు

రూ. 20 ఇడ్లీ కోసం గొడవ..ఒకరిని చంపేశారు

Customers kill idli vendor : చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో చిన్నపాటి అంశాలకే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం రూ. 20 ఇడ్లీల కోసం ఓ వ్యక్తిని చంపేశారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

థానే జిల్లా మీరా రోడ్డులో 26 సంవత్సరాలు గల Virendra Amritlal Yadav అనే వ్యక్తి ప్రతి రోజు ఇడ్లీలు అమ్ముతుంటాడు. ఇతను ఆజాద్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం కూడా ఎప్పటిలాగే..ఇడ్లీలు వేస్తున్నాడు. ఇతని వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇడ్లీలు ఆర్డర్ చేసి..తినేశారు. అనంతరం యాదవ్ తో రూ. 20 కోసం గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం..ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకుంది. చిలికిచిలికి గాలివానగా మారి..ఆ వ్యక్తులు కోపంతో…Virendra Amritlal Yadavపై దాడికి దిగారు. కిందకు తోసేయడంతో..తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు.

అక్కడనే ఉన్న స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నయా నగర్ పీఎస్ లో కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు, దీనికి సంబంధించిన ఫుటేజీలను Mira Bhayander Commissionerate(Mumbai), surrounding areas (Thane, Palghar) పంపించామని పోలీసు అధికారులు తెలిపారు.