Trains Cancelled : ప్రయాణికులకు ముఖ్య గమనిక.. పలు రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
Trains Cancelled : మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్బ్లెయిర్కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం(మే 24,2021) మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు.
తుపాను హెచ్చరికలతో రైళ్లు రద్దు:
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే మీదుగా ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. ఈ రైళ్లను ఒక్కో రోజు పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రద్దయిన తేదీలు 24-30 మధ్య ఉన్నాయి.
ఈ నెల 24న హజ్రత్ నిజాముద్దీన్-సంత్రగచ్చి(02767), హౌరా-యశ్వంతపూర్ (02863), హౌరా-వాస్కోడిగామా(08047), 26న సంత్రగచ్చి-హజ్రత్ నిజాముద్దీన్(02768), 27న తిరువనంతపురం-షాలిమార్ (02641), హౌరా-తిరుచునాపల్లి(02663), చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి(02808), వాస్కోడిగామా-హౌరా(08048), 27, 28 తేదీల్లో పాట్నా-యర్నాకులం(02644), 28న పురులియా-విల్లిపురం(06169), హౌరా-మైసూరు(08117), 29న కన్యాకుమారి-హౌరా(02666), తాంబ్రం-జసిదిహ్(02375), యశ్వంతపూర్-హౌరా(06597), హౌరా-యర్నాకులం(02877), 30న హౌరా-పుదుచ్చేరి(02867) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.