Tamil Nadu Accident : ఈ కారు డ్రైవర్ కి ఏ శిక్ష వేయాలి?
తమిళనాడులో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సేలం జిల్లా వజ్రప్పడ్డి వద్ద చోటుచేసుకుంది. వేంగంగా వచ్చిన ఓ కారు మరో కారును ఓవర్ టేక్ చేయబోయి పక్కనే బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Tamil Nadu Accident : తమిళనాడులో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సేలం జిల్లా వజ్రప్పడ్డి వద్ద చోటుచేసుకుంది. వేంగంగా వచ్చిన ఓ కారు మరో కారును ఓవర్ టేక్ చేయబోయి పక్కనే బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
వేగంగా వచ్చిన కారు మరో కారును ఓవర్ టేక్ చేసే సమయంలో పక్కనే వెళ్తున్న బైక్ ను ఢీకొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రమాదం అనంతరం కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న శివపురం పోలీసులు కారు కోసం గాలింపు చేపట్టారు.
కాగా ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగిందని
ఆ సమయంలో అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రమాదానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారు నడిపిన వ్యక్తికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు నెటిజన్లు.. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Four injured in car terror attack on Shivapuram bypass near Vajappadi in Salem district of Tamil Nadu. #Chennai pic.twitter.com/yrQENQerhh
— DONTHU RAMESH (@DonthuRamesh) July 26, 2021