అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్ యాదవ్ పార్థీవదేహం ఉత్తరప్రదేశ్ లోని స్వస్థలపైన తోఫాపూర్ గ్రామానికి చేరుకొంది. జై జవాన్ అంటూ ఆ ప్రాంత ప్రజలందరూ జాతీయ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోహన్ లాల్ పార్థీవదేహం స్వస్థలం డెహ్రాడూన్ కి చేరుకొంది. ఉత్తరాఖాండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ మోహన్ లాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. చివరిగా తన తండ్రికి సెల్యూట్ చేసి కన్నీటి వీడ్కోలు పలికింది అమరజవాన్ మోహన్ లాల్ కూతురు. ఈ ఘటన అక్కడివారిని కదిలించింది. డాడీ.. నీ త్యాగం మరువలేనిది.. దేశం కోసం నువ్వేచేసిన త్యాగానికి ఇదే నా సెల్యూట్ డాడీ అంటూ ఆ కూతురు చేసిన సెల్యూట్ తో ఆ ప్రాంతం అంతా ఉద్విగ్నంగా మారింది. జవాన్ కూతురిని ఓదార్చటం ఎవ్వరివల్లా కాలేదు. మిగిలిన అమరుల పార్థీవదేహాలు కూడా వారి స్వస్థలాలకు చేరుకొంటున్నాయి. జవాన్ల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల రోదనలతో ఆయా ప్రాంతాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి.
#Dehradun: Daughter of CRPF ASI Mohan Lal pays last tribute to her father. #PulwamaAttack pic.twitter.com/ZzvkKLPPgg
— ANI (@ANI) February 16, 2019
Dehradun: Uttarakhand Chief Minister Trivendra Singh Rawat pays tribute to CRPF ASI Mohan Lal who lost his life in #PulwamaAttack pic.twitter.com/o9QxZ5F2ED
— ANI (@ANI) February 16, 2019
Varanasi: Mortal remains of CRPF jawan Ramesh Yadav have been brought to his native village Tofapur in Varanasi. #PulwamaAttack pic.twitter.com/fdCYCyxREb
— ANI UP (@ANINewsUP) February 16, 2019
Read Also: ఉగ్రదాడి : భార్యతో ఫోన్ మాట్లాడుతునే జవాన్ మృతి
Read Also: ఆ ఘటనతోనే ఉగ్రవాదిగా..సూసైడ్ బాంబర్ అదిల్ తల్లిదండ్రులు