Rahul Gandhi : సూరత్ కోర్టుకి హాజరైన రాహుల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం సూరత్​ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు "మోదీ" ఉద్దేశించి

Rahul Gandhi : సూరత్ కోర్టుకి హాజరైన రాహుల్

Rahul

Rahul Gandhi  పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం సూరత్​ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు “మోదీ” ఉద్దేశించి రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. రాహుల్​పై పరువు నష్టం కేసు వేశారు. పరిశీలనకు స్వీకరించిన సూరత్​ కోర్టు.. రాహుల్ గాంధీ కోర్టుకి హాజరు కావాలని గతంలో నోటీసులు పంపింది

ఈ కేసుకి సంబంధించి ఇవాళ రాహుల్ సూరత్ కోర్టుకి హాజరయ్యారు. రాహుల్​తోపాటు మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. అయితే ఈ కేసుకి సంబంధించి సూరత్ కోర్టుకి రాహుల్ హాజరవడం ఇది మూడవసారి. చివరిగా జులై-24న ఈ కేసుకి సంబంధించి సూరత్ కోర్టుకి హాజరయ్యారు రాహుల్.

ALSO READ Long Range Bomb : భారత్ మరో ఘనత..లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం