వయస్సు 110..ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన బామ్మ సందేశం..అందరికీ ఆదర్శం..
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే అత్యంత కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేని కలితారా మండల్ అనే ఈ 110 సంవత్సరాల బామ్మ రాజ్యంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా బామ్మ మాట్లాడుతూ..‘ఈ ఎన్నికల్లో ఓటేసే వాళ్లలో నేనే అందరికంటే పెద్దదాన్నట’ అని గర్వంగా చెబుతోంది. ఓటు వేయటం ప్రతీ పౌరుడి హక్కు అని తెలిపారు.
‘ఓటు చాలా ముఖ్యమైనది. ఇది రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. నాకు ఓటు హక్కు వచ్చిప్పటి నుంచి తప్పకుండా ఓటేస్తున్నా. అందరికంటే పెద్దదానిగా ఢిల్లీలోని ప్రతి ఓటరును నేను కోరేదొక్కటే.. నేను ఓటు వేస్తున్నా మీరు కూడా వేయండి’ అంటూ సందేశం ఇచ్చారు బామ్మగారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేయనున్న కోటీ 47 లక్షల 86 వేల మందికి పైగా ఓటర్లలో.. కలితారా మండల్ అనే ఈ 110 సంవత్సరాల బామ్మే అందరికంటే సీనియర్ అని అధికారులు తెలిపారు. కాగా..ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 1.47 కోట్లకు పైగా ఓటర్లు 650 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. మహిళలు, పురుషులేగాక ఢిల్లీలో 869 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు.
110-yrs-old Kalitara Mandal, the oldest voter of Delhi, is all set to cast her vote for #DelhiElections2020 today. She says “I’ve always cast my vote ever since I received my voter ID. I feel happy while casting vote. It gives me power. I wish each & every citizen casts his vote” pic.twitter.com/4ZXWdvVbAg
— ANI (@ANI) February 7, 2020