ఇన్సూరెన్స్ కోసం కిరాయి రౌడీలతో మర్డర్ చేయించుకున్న బిజినెస్‌మ్యాన్

  • Published By: Subhan ,Published On : June 15, 2020 / 01:48 PM IST
ఇన్సూరెన్స్ కోసం కిరాయి రౌడీలతో మర్డర్ చేయించుకున్న బిజినెస్‌మ్యాన్

ఢిల్లీలో సినీ ఫక్కీ రేంజ్ లో మర్డర్ జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనను మర్డర్ చేయాలంటూ సుపారీ ఇచ్చి హత్య చేయించుకున్నాడు. కాంట్రాక్ట్ కిల్లర్లను పురమాయించి తనను చంపుకోవడానికి కారణం ఇన్సూరెన్స్ డబ్బులు అయినా వస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని నమ్మకం. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

జూన్ 9న ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో మృతి చెందిన వ్యక్తి కనిపించలేదని కేసు ఫైల్ అయింది. కుటుంబంలోని సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. జూన్ 10న పీఎస్ రన్హోలా లో పీసీఆర్ కాల్ వచ్చింది. ఖేడీ వాలా ప్రాంతంలోని బప్రోలా విహార్లో చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి చనిపోయినట్లు తెలిసింది. 

కాల్ వచ్చిన వెంటనే స్థానిక పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. 35ఏళ్ల వ్యక్తి ఓ కొమ్మకు వేలాడుతూ కనిపించాడు. ప్రాథమిక విచారణలో పోలీసులు మృతుని చేతులు కట్టేసి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో ఆ వ్యక్తి మిస్సయిన బిజినెస్‌మ్యాన్ అని తెలిసింది. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. 

కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించిన తర్వాత ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ బట్టి అతని కాంట్రాక్ట్ వ్యక్తులు మర్డర్ చేసినట్లు తెలిసింది. తనకు తానే డబ్బులు ఇచ్చి హత్య చేయించుకున్నట్లు బయటపడింది. లీడ్ ప్రకారం దర్యాప్తు చేసి నిజాలు తెలుసుకున్నారు. వారు చెట్టుకు వేలాడదీసి హత్య చేసినట్లు కనుగొన్నారు. 

ముందుగానే వారికి సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. చనిపోయిన వ్యక్తి తనను చంపాలని అలా జరిగితే కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పినట్లు విచారణలో నిందితులు బయటపెట్టారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో మర్డర్ చేయించుకుని డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు.