Ban On Firecrackers : బాణాసంచా కాలిస్తే 6 నెలలు జైలు శిక్ష, రూ.200 జరిమానా- ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దీపావళి రోజున పటాకులు కాలిస్తే 6 నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ హెచ్చరించారు. ఇక పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.

Ban On Firecrackers : బాణాసంచా కాలిస్తే 6 నెలలు జైలు శిక్ష, రూ.200 జరిమానా- ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

 

Ban On Firecrackers : దీపావళి అనగానే టక్కున గుర్తొచ్చేది పటాకులే. దీపావళి పండుగ రోజు సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లుతుంది. ధనిక పేద, చిన్న పెద్ద అనే తేడా ఉండదు.. అంతా కలిసి పటాకులు పేలుస్తూ ఎంజాయ్ చేస్తారు.

అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం సీన్ మరోలా ఉండనుంది. దీపావళి నాడు అక్కడ పటాకులు పేలవు. క్రాకర్స్ లేకుండానే ఢిల్లీ ప్రజలు పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి. బాణాసంచాను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. బాణాసంచా తయారు చేసినా, నిల్వ చేసినా, అమ్మినా, కాల్చినా జరిమానా విధిస్తామంది. అంతేకాదు మూడేళ్లు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.

దీపావళి రోజున పటాకులు కాలిస్తే 6 నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ హెచ్చరించారు. ఇక పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”ఢిల్లీలో బాణాసంచా కొనుగోలు చేసి కాల్చితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాం. పటాకులపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను నియమించాం. ఢిల్లీ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో 210 బృందాలు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 165, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో 33 బృందాలను ఏర్పాటు చేశాం” అని మంత్రి వివరించారు. ఇక ఈ నెల 21న ‘దియే జలావో.. పతాఖే నహీ’ (దివ్వెలు వెలిగించండి.. పటాకులు కాదు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు గోపాల్‌రాయ్‌ తెలిపారు.

దీపావళితో సహా వచ్చే ఏడాది ఒకటో తేదీ వరకు అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకాలు, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధిస్తూ సెప్టెంబర్‌లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది.

శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధానిని గాలి కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను రైతులు కాల్చివేస్తుండడంతో పొగంతా ఢిల్లీ వైపు చేరి గాలి కాలుష్యం పెరుగుతోంది. దీనికి తోడు వాహనాల కాలుష్యం, మంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఈ క్రమంలో బాణాసంచా కాల్చడం వల్ల కాలుష్యం మరింత పెరిగిపోతుందని ప్రభుత్వం భయపడుతోంది. ఈ క్రమంలో క్రాకర్స్ కాల్చడంపై బ్యాన్ విధిస్తూ వస్తోంది.