vaccine mandate For Employees : వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీసులోకి అనుమతి..ఢిల్లీ సర్కార్ ఆదేశాలు

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

vaccine mandate For Employees : వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీసులోకి అనుమతి..ఢిల్లీ సర్కార్ ఆదేశాలు

Kejriwal (1)

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఆఫీసులకు రానీయకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోని వాళ్లు ఈ నెల 16 నుంచి ఆఫీసులకు రావొద్దంటూ ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌‌పర్సన్‌ విజయ్ దేవ్ ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబరు 15 లోపు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్ 16 నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ పొందే వరకు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విద్యాసంస్థలకు హాజరుకావడానికి అనుమతించబోమని…వ్యాక్సిన్ తీసుకునే వరకు వారిని సెలవులో ఉన్నట్లుగా పరిగణిస్తామని ఈ ఆదేశాల్లో తెలిపారు.

ఆఫీసులకు వచ్చే ఉద్యోగులను ఆరోగ్య సేతు యాప్‌ లేదా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పరిశీలించి మాత్రమే అనుమతించాలని అన్ని డిపార్ట్‌మెంట్ హెడ్స్‌ను ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఇటువంటి మార్గదర్శకాలను కేంద్రం అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌మెంట్లు, టీచర్లు, హెల్త్ సిబ్బంది అందరికీ అక్టోబర్‌‌ 15 లోగా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సెప్టెంబర్ 29న నిర్వహించిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మీటింగ్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రజలతో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యే డిపార్ట్‌మెంట్లలోని ఉద్యోగులకు ముందుగా కనీసం ఒక డోస్ అయినా కరోనా వ్యాక్సిన్ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించి ఆదేశాలు జారీ చేశా