A K Rakshit : కరోనాతో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఓఎస్డీ మృతి
కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో విలయం సృష్టించింది.
A K Rakshit కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధానిలో విలయం సృష్టించింది. వైరస్ బారినపడి సామాన్యులతో పాటు ప్రముఖులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ OSD (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఏకే రక్షిత్ కరోనా మహమ్మారికి బలయ్యారు.
ఇటీవల కరోనా బారినపడిన ఏకే రక్షిత్ ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని ఆకాశ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఏకే రక్షిత్ మృతిపట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక,
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 946 కొవిడ్ పాజిటవ్ కేసులు నమోదవగా, 78 మంది ప్రాణాలు కోల్పోయారని ఆదివారం ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.