JNUలో ఉండాలంటేనే భయమేస్తోంది అందుకే వెళ్లిపోతున్నా : PHD స్టూడెంట్ 

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 07:56 AM IST
JNUలో ఉండాలంటేనే భయమేస్తోంది అందుకే వెళ్లిపోతున్నా : PHD స్టూడెంట్ 

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఉండాలంటే భయమేస్తోందని ఇది యూనివర్శిటీయా లేక వీధి గూండాలా రాజ్యమా అనిపించేలా ఉందని..భయంతో క్షణమొక యుగంలా గడపాల్సి వస్తోందని అందుకే తాను వర్శిటీ నుంచి వెళ్లిపోతున్నాననీ ఓ పీహెచ్ డీ విద్యార్ధిని  తెలిపింది.  పరిస్థితులు చక్కబడిన తరువాత వస్తానని ఇటువంటి వాతావరణం విద్యార్ధులకు ఏమాత్రం మంచిది కాదని..విద్యార్ధుల భవిష్యత్తుమీద ఇటువంటి ఘటనలు ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తంచేసింది. 

JNUలో ఆదివారం (జనవరి 5,2020) 50మంది ముసుగు ధరించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లు, క్రికెట్ బ్యాట్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. విద్యార్థులు, లెక్షరర్లపై దాడి చేశారు. జేఎన్ యూలోని కార్లు, బైక్ లను ధ్వంసం చేశారు. జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పై దుండగులు దాడి చేశారు.

ఈ దాడిలో 30మందికిపైగా విద్యార్ధులు గాయపడ్డారు. జేఎన్​యూ విద్యార్థులపై దాడి చేసింది ఏబీవీపీ సభ్యులేనని వర్శిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనతో క్యాంపస్ లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులు వారి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.