Delhi Police: ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు పేలుళ్ల కేసులో నలుగురు అరెస్ట్

బాంబు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా పారిపోయారు అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఇక ఈ పేలుడు సమయంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

Delhi Police: ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు పేలుళ్ల కేసులో నలుగురు అరెస్ట్

Delhi Police

Delhi Police: ఈ ఏడాది జనవరి 29న ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా జమ్మూకాశ్మీర్ లోని కార్గిల్ కు చెందిన విద్యార్థులని పోలీసులు తెలిపారు.

వీరిని తీసుకొచ్చేందుకు ఢిల్లీ పోలీసులు కార్గిల్ వెళ్లారు. అక్కడ వారిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిస్ రిమాండ్ పొందారు. అనంతరం నలుగురిని అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. విద్యార్థులకు పేలుడు పదార్దాలు ఎక్కడినుంచి వచ్చాయి? బాంబులు పెట్టడానికి సహకరించిన వారు ఎవరు?

బాంబు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా పారిపోయారు అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఇక ఈ పేలుడు సమయంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.