Delhi Unlock 3.0 : ఢిల్లీలో ఇక నుంచి తెరిచి ఉండేవి ఇవే

దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకొంటోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల సంఖ్యలోకి చేరుకున్నాయి. దీంతో నిబంధనలను సవరిస్తోంది. మే నెలాఖరులో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు అనుమతులిస్తోంది. మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

Delhi Unlock 3.0 : ఢిల్లీలో ఇక నుంచి తెరిచి ఉండేవి ఇవే

Delhi Unlock

Chief Minister Arvind Kejriwal : దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకొంటోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల సంఖ్యలోకి చేరుకున్నాయి. దీంతో నిబంధనలను సవరిస్తోంది. మే నెలాఖరులో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు అనుమతులిస్తోంది. మరిన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న సరి – బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే..విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసే ఉంటాయని, మతపరమైన పండుగలు, విద్యా, సాంస్కృతిక, క్రీడలపై ఆంక్షలు కొనసాగనున్నాయని వెల్లడించారు.

అంతేగాకుండా..స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, స్పోర్ట్ కాంప్లెక్స్ తెరిచి ఉండవు. జిమ్ లు, యోగా కేంద్రాలు, పబ్లిక్ పార్క్ లు, స్పాలు మూసే ఉంటాయి. వారం రోజుల తర్వాత..పరిస్థితిని బట్టి..మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు హాజరయ్యే వారి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ ఏ అధికారులు వంద శాతం, మిగతా గ్రూపుల్లో 50 శాతం సిబ్బంది విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి..ఇందులో 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

సిటీ బస్సుల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపించాల్సి ఉంటుంది. ఆటోలు, రిక్షాలు, టాక్సీల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మార్కెట్ కాంప్లెక్స్ లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పూర్తి కార్యకలాలపాలు జరుపుకోవచ్చు. జోన్ కు ఒక వారం సంత నిర్వహించుకోవచ్చని, ఫంక్షన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవడానికి అనుమతినివ్వడం, కేవలం 20 మందితో ఇళ్ల వద్దే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే..ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు అనుమతిలేదని స్పష్టం చేశారు. అంత్యక్రియల్లో 20 మంది పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Read More : Odisha Transgenders: పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు పర్మిషన్