ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు : క్రూ సిబ్బందికి గాయాలు

ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : September 22, 2019 / 02:37 AM IST
ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు : క్రూ సిబ్బందికి గాయాలు

ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి.

ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంపై పిడుగు ప్రభావానికి గురైంది. విమానం క్రూ సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పిడుగు కారణంగా విమానం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

AI-467 నెంబర్ గల ఎయిర్ ఇండియా విమానం శనివారం (సెప్టెంబర్ 21, 2019) రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయింది. అది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోవాల్సి ఉంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉరుములు, మెరుపుల వర్షంలో చిక్కుకున్న విమానం పిడుగు ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. 

ఉరుములతో కూడిన వర్షంలోని పిడుగుపాటు ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది.