భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా భార్యపై కాల్పులు

భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా భార్యపై కాల్పులు

ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్‌కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్‌మెంట్‌ చేయించే క్రమంలో మధ్యలో గుడి వద్ద ఆగారు. 

గుర్తు తెలియన వ్యక్తులు బైక్‌ల మీద వచ్చి కారులో భర్త కోసం ఎదురుచూస్తూన్న ఉషా షాని అనే మహిళపై కాల్పులు జరిపారు. భర్త షాని గుడిలో నుంచి దర్శనం ముగించుకుని వచ్చే లోపే ప్రమాదం జరిగింది. షూట్ చేసిన వారు పరారీలో అవడంతో కారు వద్దకు వచ్చేంత వరకూ జరిగిందేమిటో తెలియలేదు. 

కారు దగ్గరకు సమీపించిన భర్తకు భార్య రక్తపు మడుగులో ఉండడం గమనించాడు. స్థానికులను బతిమాలి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మహిళ చనిపోయిందని వైద్యులు తేల్చి చెప్పేశారు. పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. అనుమానితులను విచారిస్తూ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దాడి చేసిన వారిని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.