చెయిన్ కోసం..మహిళను పొడిచి చంపిన స్నాచర్

చెయిన్ కోసం..మహిళను పొడిచి చంపిన స్నాచర్

Robbed : చెయిన్ స్నాచర్ లు ఎంతకైనా తెగిస్తున్నారు. మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకుని పారిపోయే సమయంలో దారుణాలకు తెగబడుతున్నారు. రెండేళ్ల బిడ్డతో కలిసి వెళుతున్న మహిళ మెడలో ఉన్న చెయిన్ దొంగిలించేందుకు ప్రయత్నించగా..అడ్డుకున్న ఆ మహిళను కత్తితో పొడిచి పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో చోటు చేసుకుంది.

సిమ్రాన్, మరో మహిళ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో నడుచుకుంటూ వస్తున్నారు. తన రెండేళ్ల బిడ్డను ఎత్తుకున్న సిమ్రాన్..మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో..వారికి సమీపంలోనే..ఓ యువకుడు..వస్తున్నాడు. అమాంతం…సిమ్రాన్ మెడలో ఉన్న ఛైన్ ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

దీనిని సిమ్రాన్ అడ్డుకుంది. ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. కిందపడిపోయిన స్నాచర్ అమాంతం..లేచి చేతిలో ఉన్న కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. సిమ్రాన్ చేతిలో ఉన్న బిడ్డ అప్పటికే కిందపడిపోయింది. తీవ్రగాయాలైన సిమ్రాన్ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.