Pollution: ఆస్పత్రులు కిటకిట.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.

Delhi-NCR: ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు.. కరోనాతో ఇటీవల ఊపిరితిత్తులలో సమస్యలు వచ్చినవారు.. ఈ కాలుష్యం కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం.
ఢిల్లీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్మాణ పనులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రేపటి నుంచి వారం రోజుల పాటు విద్యార్థులకు ఫిజికల్ స్కూల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఒక వారం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేట్ కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్కు 100శాతం అనుమతివ్వాలని కోరాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా రోడ్లపైకి వచ్చే వాహనాలు తగ్గుతాయని భావిస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. అవసరమైతే లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకి తీసుకుంటున్న చర్యలపై రేపు(15 నవంబర్ 2021) మరోసారి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. కాలుష్యం ఉన్న విధానం చూస్తుంటే, ఇప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందని, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రోగులకు పెద్ద సమస్య ఇదేనని డాక్టర్లు చెబుతున్నారు.
కోవిడ్ నుంచి, ఇంకా కోలుకోని రోగులకు.. కాలుష్యం కారణంగా కోలుకోవడానికి సమయం పడుతుంది అని అంటున్నారు. కాలుష్యం వారిని ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు చాలావరకు మందులు లేకుండా జీవిస్తున్నారు. ప్రస్తుతం కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్య ఉందని, తనిఖీ చేయగా అదే తేలిందని అంటున్నారు.
కాలుష్యం ప్రభావంతో కళ్లలో మంటలు, ముక్కులో నీరు కారడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుందని, శరీరంలోకి వెళ్లినప్పుడు, అది రక్తంలోకి వెళ్లి గుండె సమస్యలు పెరుగుతాయని.. క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉందని, వీలైనంతవరకు బయటకు రావద్దని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరంలోని ప్రతి భాగాన్ని కాలుష్యం ప్రభావితం చేస్తుందని, దగ్గు, శ్వాసకోశ సమస్యతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతుందని అన్నారు.
- Centre Warns Restaurants: సర్వీసు ఛార్జీల వసూలు.. రెస్టారెంట్లకు కేంద్రం వార్నింగ్
- FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
- polygamy: బహుభార్యత్వంపై మీ వైఖరేంటి.. కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు ప్రశ్న
- CM Jagan-PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ
- PM Modi : నేడు ప్రధాని మోదీతో రష్యా మంత్రి భేటీ.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చ
1Pavitra Lokesh : సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..
2RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
3Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య
4Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
5Pat Cummins Sixer : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. భారీ సిక్సర్ బాదిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
6Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
7Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
8Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
9The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
10BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!