కెనడా వ్యక్తిని INS సుమిత్రలోకి తీసుకెళ్లిన మోడీ

  • Published By: sekhar ,Published On : May 10, 2019 / 08:35 AM IST
కెనడా వ్యక్తిని INS సుమిత్రలోకి తీసుకెళ్లిన మోడీ

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారని,అందులో విదేశీయులను రాజీవ్ తనతో తీసుకెళ్లారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ గా ఉంది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఫైర్ అయింది. మోడీనే ఐఏఎఫ్ ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారంటూ కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ మీడియా రిపోర్ట్ ను ప్రస్తావించగా, మాజీ ఎంపీ రమ్య కూడా మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు.ఓ కెనడా వ్యక్తిని మీరు INS సుమిత్రలోకి తీసుకెళ్లారంటూ హీరో అక్షయ్ కుమార్ యుద్ధ నౌకలో ఉన్న ఫొటోలను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.అక్షయ్ కుమార్ కెనడా సిటిజన్ షిప్ కలిగి ఉన్న విషయం తెలిసిందే.