శ్రీరాముని ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు.. మరి.. శ్రీరాముని డేట్ ఆఫ్ బర్త్ తెలుసా?

శ్రీరాముని ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు.. మరి.. శ్రీరాముని డేట్ ఆఫ్ బర్త్ తెలుసా?

శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు.? నిజంగానే.. రాముడు అక్కడి వీధుల్లో తిరిగాడా? రామాయణ ఇతివృత్తానికి అయోధ్యే వేదికగా నిలిచిందా? పురాణాలతోపాటు శాస్త్రవేత్తల పరిశోధనలు ఏం చెబుతున్నాయ్? ఆనాటి అయోధ్య గురించి.. ఈనాటి రీసెర్చ్ తేల్చిందేంటి?



శ్రీరాముని ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు.. మరి.. శ్రీరాముని డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? అయోధ్యలో.. శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు? పురాణాలు చెప్పిందేంటి..? రీసెర్చ్ తేల్చిందేంటి?

శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడని అందరికీ తెలుసు. కానీ.. ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుట్టాడన్నది మాత్రం.. ఎవరికీ స్పష్టంగా తెలియదు. చాలా మంది చరిత్రకారులు శ్రీరాముని గురించి అధ్యయనం చేశారు. రాముడు.. చారిత్రక పురుషుడని.. పాశ్చాత్యులు కూడా నిర్ధారించారు. పురాణాల్లో.. రాజవంశాలను పరిశీలించి.. శ్రీరాముడు మహాభారత యుద్ధం నాటికి.. అతి ప్రాచీనుడని నిర్ధారించారు.



పురాణాలన్నీ రాముడు త్రేతాయుగంలోనే జన్మించాడని చెబుతున్నాయ్. వాల్మీకి రామాయణం కూడా.. రామాయణమంతా త్రేతాయుగంలో జరిగిందేనని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ.. మనందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీలేవీ చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్లుగా తెలిపారు. రాముడు జన్మించిన సమయంలో.. సూర్యుడు మేషనరాశిలో.. గురుడు కర్కాటక రాశిలో.. కుజుడు మకరరాశి లో.. శని తులారాశిలో.. శుక్రుడు మీనరాశిలో.. ఉచ్ఛ స్థితిలో కొలువై ఉన్నారు.

చైత్రశుద్ధ నవమి.. కర్కాటక లగ్నంలో.. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని.. వాల్మీకి రామాయణం చెబుతోంది.
రామాయణంలో వాల్మీకి చెప్పిన వివరాల ఆధారంగా.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అనే సంస్థ.. పరిశోధనలు మొదలుపెట్టింది. ప్లానిటోరియం అనే స్పెషలైజ్డ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి.. కచ్చితమైన కాల నిర్ధారణ చేసి.. శ్రీరాముని జన్మదినానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు.



శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5వేల 114లో జనవరి 10వ తేదీన.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జన్మించినట్లు నిర్ధారించింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా.. శాస్త్రవేత్తలు రాముడి పుట్టినరోజు గురించి సమయం, సంవత్సరంతో సహా చెప్పగలిగారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిస్టులు.. అయోధ్యలో రాముడు జన్మించాడని.. రామాయణం నిజంగా జరిగిందని కూడా ఆధారాలు సంపాదించారు. రాముడు భారత భూమిపైనే జన్మించాడని.. అయోధ్య పురవీధుల్లో నడిచాడని.. పరిశోధకులు నిర్ధారించారు. అయోధ్యని.. శ్రీరాముని జన్మస్థానంగా చెప్పబడినా.. ఇక్కడి రామ్ కోట్ వార్డ్లోని ప్రత్యేక ప్రదేశమే.. శ్రీరాముడి అసలు ప్రదేశం. దీనినే.. రామజన్మభూమిగా పిలుస్తారు. ఇక్కడే.. అప్పట్లో శ్రీరామునికి చిన్న దేవాలయం నిర్మించారు.



వాల్మీకి విరచితమైన రామాయణ మాహాకావ్యంలోని.. మొదటి అధ్యాయంలో.. అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలో ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, జనం విశ్వసనీయత గురించి గొప్పగా చెప్పారు. తులసీదాసు తిరిగి రచించిన రామచరితమానస్లోనూ.. అయోధ్య వైభంగా గొప్పగా వర్ణించారు. హిందూ పవిత్ర గ్రంథాల్లో.. పురాణాలు ముఖ్యమైనవి. స్కంద, ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్షపురాలలో.. అయోధ్య ఒకటని చెబుతున్నాయ్.

ప్రస్తుతం అయోధ్య చరిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు.. తప్పక చూడాలని కోరుకునే పవిత్ర స్థలం. ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య కూడా ఒకటి. అధర్వణ వేదం.. అయోధ్య దేవనిర్మితమని.. స్వర్గసమానమని తెలిపింది.