Cow Dung : కరోనా రాదని ఆవుపేడ పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయి జాగ్రత్త : డాక్టర్ల హెచ్చరిక

కరోనా రాకుండా ఉండటానికి ఒంటికి ఆవు పేడ పూసుకుంటే కొత్త జబ్బులు వచ్చే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కానీ శరీరానికి ఆవుపేడ, మూత్రం పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయని..హెచ్చరిస్తున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను రాకుండా చేస్తాయనే ప్రచారాలు నమ్మవద్దని..దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు..ఆవుపేడ, మూత్రం ద్వారా కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Cow Dung : కరోనా రాదని ఆవుపేడ పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయి జాగ్రత్త :  డాక్టర్ల హెచ్చరిక

Cow Dung Therapy For Corona

Doctors warns about cow dung therapy for corona : కరోనా రాకుండా ఉండాలంటే ఆవు మూత్రం తాగాలనీ..వచ్చిన ఆవు మూత్రం తాగితే తగ్గిపోతుందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటం తెలిసిందే. ఆవు పేడ, మూత్రంతో కరోనా రాదని కొంతమంది మిడి మిడి జ్నానంతో చెబుతున్నారు. సోషల్ మీడియాలో అటువంటి పోస్టుల్ని చూస్తున్నాం. కానీ శరీరానికి ఆవుపేడ, మూత్రం పూసుకుంటే కొత్త జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను రాకుండా చేస్తాయనే ప్రచారాలు నమ్మవద్దని..దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు..ఆవుపేడ, మూత్రం ద్వారా కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

గుజరాత్ లో కొందరు వారానికి ఒకసారి గోశాలకు వెళ్లి పేడ, మూత్రం సేకరించి ఒంటికి పూసుకుంటున్నారు. ఇది కరోనా మహమ్మారికి విరుగుడు అని చెబుతున్నారు. గౌతమ్ మణిలాల్ అనే ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ కూడా గోశాలకు వచ్చి శరీరానికి దట్టంగా ఆవు పేడ పట్టించి ఇదే కరోనా నివారణకు దేశీయ చిట్కా అని చెబుతున్నాడు. గతేడాది తాను కరోనా నుంచి కోలుకోవడానికి గోవుపేడ, గోమూత్రం సహకరించాయని చెప్పుకొచ్చారు.

ఇటువంటి విషయాలపై ప్రపంచవ్యాప్త డాక్టర్లు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జె.ఏ.జయ్ లాల్ స్పందిస్తూ, ఇలాంటివన్నీ ఒక్కొక్కరి నమ్మకాలకు సంబంధించిన విషయాలని అన్నారు. ఆవు పేడ, మూత్రంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనడానికి రుజువులేవీ లేవని స్పష్టం చేశారు. ఇమ్యూనిటీ సంగతి పక్కనబెడితే… జంతువుల నుంచి కొత్త జబ్బులు మానవులకు సంక్రమించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.