PM CARES Fund: వ్యాక్సిన్ వేయించుకోండి.. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.500 విరాళమివ్వండి

వ్యాక్సిన్ వేయించుకోండి.. ఆ తర్వాత పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.500 విరాళమివ్వండి అంటూ మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు. రెండు డోసులు వేసుకున్న తర్వాత..

PM CARES Fund: వ్యాక్సిన్ వేయించుకోండి.. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.500 విరాళమివ్వండి

Vaccination Donation

PM CARES Fund: వ్యాక్సిన్ వేయించుకోండి.. ఆ తర్వాత పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.500 విరాళమివ్వండి అంటూ మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు. రెండు డోసులు వేసుకున్న తర్వాత అంత డబ్బు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదని చెప్తున్నారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే.. ‘కొవిడ్ మహమ్మారి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అందుకే చేతులు జోడించి అడుగుతున్నా. దేవుడి దయ వల్ల ఇవ్వగలిగిన వాళ్లంతా.. రూ.500ను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్’ అని అన్నారు.

ఒక్కో డోసుకు అయ్యే ఖర్చు రూ.250 అని మనందరికీ తెలుసు. అలా రెండు డోసులు ఉచితంగా తీసుకుంటే రూ.500 ఫండ్ రూపంలో ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే అని ఆమె చెప్తున్నారు. ఇండియా వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నందుకు బీజేపీ లీడర్లు ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతున్న క్రమంలో ఈమె కూడా ఇలా రియాక్ట్ అయ్యారు.