Coronavirus : భారతీయులు భయపడాల్సిన పని లేదు
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి మెడిసిన్ లేదు. వైరస్ సోకితే ప్రాణం పోవాల్సిందే. అందుకే అందరూ వర్రీ అవుతున్నారు. ఇక భారత్ లోనూ Coronavirus గురించి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు.
Coronavirus భారత్ లో లేదని చెప్పారు. భారతీయులు భయపడాల్సిన పని లేదన్నారు. Coronavirusపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలని అన్ని ఆసుపత్రులు ఆదేశించామన్నారు. Coronavirus లక్షణాలు కనిపిస్తే హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేయొచ్చు అని చెప్పారు.
మరోవైపు కరోనా వైరస్ పై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. మరో 13 విమానాల్లో Coronavirus స్ర్కీనింగ్ ఏర్పాటు చేశారు. మరిన్ని థర్మల్ స్కానర్లను కొనుగోలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పుణె సహా దేశంలో మరో 4 చోట్ల ల్యాబ్ ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్నటి వరకు (జనవరి 27,2020) 155 విమానాలు, 33వేల 552 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ చేశారు.
ఇక చైనాలోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. స్వదేశానికి వచ్చిన తర్వాత 14 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నారు. Coronavirus చర్యలపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్షరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.
Also Read : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!
Health Minister Dr.Harsh Vardhan: There is nothing to panic, #coronavirus has not come to India. We have taken all precautionary measures. All hospitals have been asked to make isolation wards, we have launched a helpline number. (file pic) pic.twitter.com/6yBBj6X7Ln
— ANI (@ANI) January 28, 2020
చైనాలో పుట్టిన Coronavirus ప్రాణాంతకంగా మారింది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణ భయంతో ప్రపంచ దేశాల ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి కరోనా కాటేస్తుందోనని హడలి చస్తున్నారు. కరోనా వైరస్.. పుట్టక చైనాలోని wuhan సిటీలో వెలుగులోకి వచ్చింది. అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు పాకింది.
ఇప్పుడు ఇండియలోకి కూడా వైరస్ ప్రవేశించిదంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చైనాకు వెళ్లొచ్చిన చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయంటున్నారు. కరోనా వైరస్ మూలం ఎక్కడ? అదేలా మనుషులకు వ్యాపించింది అనే కోణంలో సైంటిస్టులు, పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడి 106 మంది ప్రాణాలు కోల్పోగా 2700 మందికి ఈ వైరస్ సోకినట్టు కేసులు నమోదయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కనీసం యాంటీ ట్రీట్ మెంట్ కూడా అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ బారి నుంచి ఎలా బయటపడాలని అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Union Health Minister, Harsh Vardhan: We are in contact with Chinese authorities to bring back Indians from China. Once they are brought back they will be kept in quarantine for 2 weeks and necessary medical facilities will be provided to them. #Coronavirus pic.twitter.com/9OudAnU9j5
— ANI (@ANI) January 28, 2020